Thursday, April 25, 2024

గ్రీన్ ట్రీ ఇండస్ట్రీస్ ను ప్రారంభించిన మేయర్ నీలా గోపాల్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ లోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రీ ఇండస్ట్రీస్ ను మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఈమె మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూనే, ప్రత్యేక రాయితీలు కల్పిస్తుందన్నారు. ఉద్యోగాల కోసం వేచి చూడకుండా సొంతంగా పరిశ్రమలు నెలకొల్పి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం భేష్ అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, కాసాని సుధాకర్, NMC తెరాస పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు గోపాల కృష్ణ ముదిరాజ్, నాయకులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement