Sunday, April 28, 2024

ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రిపువ్వాడ.. మజీదుల అభివృద్ధికి నిధులు

మ‌త‌సామ‌రస్యానికి కాపాడ‌టంతోపాటు.. ముస్లీం సంక్షేమానికి కృషి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వమే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని హదిసే/ఎలాన్ మజీద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రిపువ్వాడ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ ప్ర‌భుత్వ హాయాంలో రాష్ట్రంలో మ‌తాల మ‌ద్య ఘ‌ర్ష‌ణ‌లు లేకుండా స్నేహా పూర్వ‌కంగా క‌లిసి మెలిసి ఉండే సంస్కృతిని పెంపొందించారని అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని ప్రతి మజీద్ అభివృద్ధి కొరకు ఒక్కో మజీద్ కు నిధులు మంజూరు చేసినట్లు అజయ్ కుమార్ పేర్కొన్నారు. అందులో భాగంగా రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement