Sunday, May 5, 2024

పెద్దపల్లిలో విషాదం.. ఆరోగ్యం బాగోలేదని వ్యక్తి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసకుంది. పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మెట్టు నరేష్(42) ఆరోగ్యం బాగలేక మనోవేదనకు గురై శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా నరేష్ ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా.. ఆరోగ్యం కుదుట పడకపోవటంతో మనో వేదనకు గురయ్యాడు. దీంతో శుక్రవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత బలవన్మరణo చేసుకున్నాడు. నరేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య మాధవితో పాటు కూతురు రక్షిత(17), కొడుకు దేవన్ష్(6) వున్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement