Sunday, May 5, 2024

లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

కామారెడ్డి జిల్లా  కేంద్రంలోని దేవునిపల్లి పాత కలెక్టరేట్ ఆఫీస్ వద్ద మంగళవారం  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా…మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement