Friday, April 26, 2024

Flash: రెండు బైకుల ఢీకొని వ్యక్తి మృతి

మంచిర్యాల: వాంకిడి-ఆసిఫాబాద్ ప్రధాన రహదారి కమాన చౌరస్తా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు తిర్యాణికి చెందిన మర్సుకోల శంకర్ గా గుర్తించారు. మర్సుకోల సుమన్, వాంకిడికి చెందిన బంక రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. సకాలంలో 108 అంబులెన్స్ రాకపోవడంతో క్షతగాత్రుడు బంక రాజు సుమారు అరగంటపాటు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడు. దీంతో ప్రైవేటు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement