Monday, May 6, 2024

Crime: కుటుంబ కలహాలతో దాడి.. అల్లుడు మృతి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని వెలుబెల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో అత్తింటి వారు దాడి చేయడంతో ఐరెండ్ల యాదగిరి(35) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. వెల్లుబెల్లి గ్రామానికి చెందిన ఐరెండ్ల యాదగిరి అదే గ్రామానికి చెందిన రాసాల సోమయ్య -సమ్మక్కల కూతురు రాసాల స్వప్నను పెళ్లి చేసుకున్నాడు. గత కొద్దికాలంగా వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, గత కొద్ది రోజులుగా అత్తగారింటి తరపు నుంచి నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో అత్త, మామ దాడి చేయగా యాదగిరి మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement