Monday, April 29, 2024

KTR: జగన్ సోదర సమానుడు.. ఏపీ అభివృద్ధి చెందాలి

ఏపీలో కరెంటు ఉండడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేపాయి. ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో స్పందించిన కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధ పెట్టి ఉండొచ్చన్నారు. అయితే, ఎవరినో కించపరచాలనో, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను తన సోదరుడిగా భావిస్తానని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ ట్వీట్‌లో చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement