Thursday, April 25, 2024

కాబూల్‌ మసీదులో శక్తిమంతమైన పేలుడు.. 10 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని మసీదులో శుక్రవారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో గాయపడినట్లు తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా ప్రార్థనల కోసం ఖలీఫా సాహిబ్ మసీదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మసీదు కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో అప్పటి వరకు కోలాహలంగా ఉన్న మసీదు ఒక్కసారిగా రక్తమోడింది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సున్నీ ముస్లింలే లక్ష్యంగా జరిగిన ఈ పేలుడులో జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement