Sunday, April 28, 2024

MBNR: నిరుపయోగ భవనాలను వినియోగంలోకి తీసుకొస్తాం.. ఎమ్మెల్యే శ్రీహరి

మక్తల్ : నారాయణపేట జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం మక్తల్ పట్టణంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలను ప్రజల అవసరం మేరకు వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరముంద‌ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ సాయంత్రం పట్టణంలోని పురాతన తహశీల్దార్ నివాస భవనాన్ని పరిశీలించారు. గత కొంతకాలంగా వినియోగించకపోవడంతో నిరుపయోగంగా మారిన ఈ భవనాన్ని ఏ విధంగా ప్రజలకు ఉపయోగంలోకి తెస్తే బాగుంటుందో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకటి శ్రీహరి తెలిపారు.

ఆ పక్కనే ఉన్న పోస్ట్ ఆఫీస్ భవనంతో పాటు ఖాళీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా కార్యాలయాలు ఏర్పాటుకు అవకాశం ఉంటే వాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా పాత పశువుల దవాఖాన, ఐడీసీ స్థలాన్ని ప్రజల అవసరాలకు ఉపయోగించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద పట్టణంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు స్థలాలను ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉపయోగంలోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. అందుకు సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వెల్లడించారు. ఎమ్మెల్యే వెంబడి కాంగ్రెస్ నాయకులు ఎండి. ఫయాజ్ కోళ్ళ వెంకటేష్, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement