Friday, April 26, 2024

తహశీల్దార్‌కు వినతి పత్రం..

దేవరకద్ర :కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతువేదిక భవనాల వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ జ్యోతి కి మండల బిజెపి అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ రెడ్డి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతువేదిక భవనాల వద్ద ప్రధాన మంత్రి ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉన్నదని ఆయన విమర్శించారు. సొమ్ము కేంద్రానికి సోకు రాష్ట్రం అన్న చందంగా ఉన్నదని ఆయన అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్ర జా ప్రతినిధులు శ్రద్ద తీసుకుని కేంద్ర నిధులతో ఏర్పాటు చేయాలని రైతువేదిక భవనాల వద్ద ప్రధానమంత్రి ఫోటోలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఎంపిటిసి యజ్ఞభూపాల్‌ రెడ్డి, శ్రీశైలం , కృష్ణారెడ్డి , శివ , అమర్‌ , దేవన్న , బాలరాజు , శేఖర్‌ రెడ్డి, కరెంట్‌ ఊషన్న , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement