Saturday, May 4, 2024

కలల్ని చిదిమేసిన మృత్యువు.. కస్తూర్భాలో విద్యార్థి టాపర్

గద్వాల రూరల్ : “పరీక్ష బాగా రాశాను మేడం, తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాసై కళాశాల టాపర్ గా వస్తును” ఈ సంఘటన గద్వాల మండలం గోనుపాడు కస్తూర్బా గాంధీ కళాశాలల అధ్యాపకులకు చివరిసారిగా రాజేశ్వరి చెప్పిన చివరి మాటలు.. గత నెల 19వ తేదీ ఆ సంవత్సరం పరీక్ష రాసి అనంతరం అధ్యాపకులు, స్నేహితులకు వీడుకోలుపలికి ఇంటికి తండ్రితో బయలుదేరుతున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది ఇద్దరు మృతి చెందారు. మంగళవారం విడుదల అయిన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 867 మార్కులు సాధించిన రాజేశ్వరి తాను చెప్పినట్టుగానే కళాశాల టాపర్ గా నిలిచింది.. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆమె తమ ముందు లేకపోవడం బాధాకరమని విద్యార్థులు,ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారి శ్రీదేవి విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement