Monday, April 29, 2024

Gadwal | ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

జోగులాంబ గద్వాల (ప్రభ న్యూస్) : జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నాటికి ముగిసిందని ఎస్పీ కె. సృజన తెలిపారు. రెండు జిల్లాలకు సంబంధించి 4967 మంది అభ్యర్థులకు గాను 4405 మంది హాజరైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న కార్యాలయం సిబ్బందిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement