Thursday, May 16, 2024

TS | తెలంగాణ పటేల్ యూత్ ఫోర్స్.. నియోజకవర్గాల వారీగా కన్వీనర్​ల ఎంపిక

హైదరాబాద్​లోని హఫీజ్ పేట్ లో ఇవ్వాల (శనివారం) తెలంగాణ మున్నూరుకాపు యూత్ ఫోర్స్ భేటీ జరిగింది. కన్వీనర్ ఎర్రం తేజ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాయిస్ టుడే ఎండి కొత్త లక్ష్మణ్ పటేల్, పేరుక రమేష్ పటేల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కన్వీనర్ లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ యూత్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ఎంతో శుభపరినామమని, ఈ రోజు అన్ని జిల్లాల నియోజకవర్గాల కన్వీనర్ లను ప్రకటించడంతో పాటు పటేల్ ఫోర్స్ సంఘాన్ని ప్రతీ మండలంలలో, ప్రతీ గ్రామానికి తీసుకుపోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement