Sunday, April 28, 2024

Sai Chandu : జనం గుండెలో బ్రతికే ఉన్న గళం‌‌…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్ 29 (ప్రభ న్యూస్) : తెలంగాణ ఉద్యమానికి తన గళంతో తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచిన యోధుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు తన పాట రూపంలో తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగా బ్రతికే ఉంటారు. గుండెపోటుతో మరణించిన తెలంగాణ ఉద్యమ నాయకుడు సాయిచంద్ మరణం తీరని లోటు అని భావించారు. తెలంగాణ ప్రజల్లో ఉద్యమకాంక్షను, ఆకాంక్షను, ఆవశ్యకతను తన పాట రూపంలో చక్కగా వివరించి అన్ని వర్గాల ప్రజలను, సామాజిక ఉద్యమకారులు, విద్యార్థులను ఉద్యమం వైపు నడిచేలా చేసిన మహా గాయకుడు మనలోనే ఉన్నాడని తెలంగాణ సమాజం భావిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement