Sunday, April 28, 2024

TS : పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి

మక్తల్, మార్చి19(ప్రభన్యూస్) : చేసిన పనులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మక్తల్ ఎంపీడీవో కార్యాలయం ముందు మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు ఆందోళన చేపట్టారు. 2009 ఫిబ్రవరి 2 నుండి సర్పంచులుగా బాధ్యతలు చేపట్టిన తాము గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల ఏర్పాటు, వైకుంఠధామం నిర్మాణం, డంపింగ్ యార్డ్ల నిర్మాణం ,సిసి రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, హరితరం వంటి ఎన్నో పనులు చేపట్టామని ఇప్పటికీ తమకు ఒక్కో పంచాయతీలో రూ.5 నుండి 10 లక్షల దాకా బిల్లులు రావాల్సి ఉందని మాజీ సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

తమకు న్యాయంగా చెల్లించాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మాజీ సర్పంచులు హెచ్చరించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వారు ఎంపీడీవో గోవిందరావుకు అందజేశారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బిల్లులు వచ్చే విదంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీడీవో మాజీ సర్పంచులకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement