Sunday, April 28, 2024

MBNR: వైభవంగా శివపార్వతుల కళ్యాణం మహోత్సవం.. పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

మక్తల్, మార్చి9 (ప్రభ న్యూస్) : మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు వేద పండిత తిప్పయ్య స్వామి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించగా బాల్చేడ్ శివకుమార్ జయంతి దంపతులు, మహేష్ సాగర్ పవిత్ర దంపతులు కళ్యాణ వేడుకల్లో పాల్గొని శివపార్వతుల కళ్యాణోత్సవం జరిపించారు.

వేదమంత్రోశ్చరణల మధ్య భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ బాల్చేడ్ పావని మల్లికార్జున్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement