Sunday, April 28, 2024

TS: కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏ దేశం నుండి నిధులు తీసుకొస్తారు? బండి సంజయ్

కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏ దేశం నుండి నిధులు తీసుకొస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో కొనసాగుతున్న ప్రజాహిత యాత్రలో ఆయన మాట్లాడుతూ..

‘పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్లీ ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమే. అన్ని సర్వేలు ఇదే చెబుతున్నయ్. అట్లాంటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే… అప్పుల్లో తెలంగాణను ఆదుకోవాలంటే నిధులు ఎక్కడి నుండి తీసుకొస్తారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోయి నిధులు తీసుకొస్తారా?’’అని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణలోనూ బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి అత్యధిక నిధులు తెలంగాణకు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement