Tuesday, April 30, 2024

TS: టాటా గ్రూప్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం..

తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా కంపెనీ, ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది.
ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ అప్ గ్రేడ్ చేయనుంది.

ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కింద 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణను టాటా టెక్నాలజీస్ అందించనుంది. 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement