Thursday, May 2, 2024

MBNR: అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మక్తల్, ఏప్రిల్ 5 (ప్రభన్యూస్) : నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం పాతర్ చేడ్ గ్రామంలో బోలుబండ వారి ఉచిత అంబలి కేంద్రాన్ని ఇవాళ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ… అనేక గ్రామాలకు ప్రధాన కూడలిగా ఉన్న పాతర్ చేడ్ గ్రామంలో బోలుబండ కుటుంబ సభ్యులు గత కొన్నేళ్లుగా ప్రతి వేసవి కాలంలో ఉచిత అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

అంబలి ఆకలితో ఉన్నవాడి కడుపు నింపుతుందని అలాంటి అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆకలి దప్పికలు తీరడం జరుగుతుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపట్టాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్, నాయకులు వివేక వర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శరణప్ప, కృష్ణారెడ్డి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement