Sunday, April 28, 2024

TS: నేటి మ్యాచ్ కు సీఎం రేవంత్ రెడ్డి ..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జ‌రిగే మ్యాచ్ చూడ్డానికి కుటుంబ సమేతంగా వెళ్ళనున్నారు. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేయనున్నారు సీఎం. గతంలో సీఎం హోదాలో ఉప్పల్‌ స్టేడియంకు కేసీఆర్ కూడా వెళ్ళారు. 9ఏళ్ల కిందట ఇండియా, శ్రీలంక మ్యాచ్‌ను ఆయన చూశారు. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ మొదటిసారి ఉప్పల్ స్టేడియానికి వెళుతున్నారు. సీఎం రేవంత్‌ కూడా మ్యాచ్‌కు వస్తుండటంతో ఫ్యాన్స్‌లో జోష్‌ మరింత పెరిగింది.

విద్యుత్ పున‌రుద్ద‌ర‌ణ …
మరోవైపు ఉప్పల్ స్టేడియానికి ఉన్న కరెంట్ కష్టాలు తొలిగిపోయాయి. బిల్లులు కట్టలేదని అధికారులు తొలగించిన కరెంట్‌ను తిరిగి పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ అధికారులు ఒక రోజు గడువు ఇచ్చినట్లు స‌మాచారం … దీంతో సన్‌రైజర్స్ వ‌ర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement