Thursday, May 16, 2024

TS: డిప్యూటీ సీఎం భ‌ట్టిని కలిసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్, జనవరి19 (ప్రభన్యూస్) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఇవాళ కలుసుకున్నారు. భట్టి నివాసం ప్రజాభవన్ లో ఇవాళ మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రిని కలుసుకుని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వడంలో సహకరించాలని కోరారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement