Sunday, May 5, 2024

ఆర్టీసీని బలోపేతం చేయడమే లక్ష్యం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ మధ్య పటిష్టమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, రానున్న రోజులలో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ బస్సు డిపోనకు నూతనంగా కేటాయించిన సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. అనంత‌రం మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆర్టీసీలో అధునాతన సౌకర్యాలతో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో సిటీ బస్సులతో పాటు ,ఎలక్ట్రిక్ బస్సులను కూడా నడిపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement