Monday, April 29, 2024

గుడుంబా స్థావరాలపై దాడులు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఎర్ర గుంట తండా గ్రామ పంచాయతీలోని సురేష్ నగర్ లో గుడుంబా స్థావరాల పై ఎక్సైజ్ పోలీస్  దాడులును ఆదివారం ఉదయం నిర్వహించారు. భారీ మొత్తంలో గుడుంబా తయారీ డ్రమ్ములు, బెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేశారు. బెల్ట్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించారు. 20 వేల విలువగల మద్యం, పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అపరిచిత వ్యక్తులు సెంచరిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్ హాజరై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ అధికారుల సహా పోలీసు సిబ్బంది సుమారు 60 మంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement