Monday, May 6, 2024

ఈదురుగాలుల బీభత్సం.. అమ్మాయి తలకు గాయం

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని లింగగిరి గ్రామంలో శనివారం రాత్రి ఈదురుగాలలు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులతో ఓ ఇంటి పై కప్పు రేకులతో సహా లేచి పక్కనే ఉన్న మరో ఇంటిపై పడ్డాయి. ఈ క్రమంలో నిహారిక అనే బాలిక తలకు గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, రేకులు పడిన ఇంట్లో ఆరుగురు ఉండగా.. మిగతా వారికి స్వల్ప గాయలైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే సర్పంచ్ మాధారపు భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి,ఇండ్లను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement