Wednesday, May 15, 2024

కోవిడ్ 19 పై అవగాహన సదస్సు..

చిన్నంబావి : మండల కేంద్రంలోని చిన్నంబావి మండల ప్రాదేశిక సభ్యురాలు.. ఎస్సై వస్త్రం నాయక్ కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సై మాట్లాడుతూ సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినా తట్టుకునే శక్తి ప్రజలకు ఉండాలని కోరుకున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజలు తమకు తామే లాక్ డాన్ విధించుకుని తమ తమ ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పిటిసి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాల అపోహలకు గురి కాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement