Thursday, April 25, 2024

వ్యాక్సిన్‌ తీసుకోండి..ఆరోగ్యంగా ఉండండి..

దేవరకద్ర : ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే ఆరోగ్యం ఉంటారని వైద్యాధికారి షహానా బేగం అన్నారు. మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రజలకు కరోనా టెస్టులు నిర్వహించారు. టెస్టులు చేయించుకున్న వారికి వ్యాక్సిన్‌ వేశారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కరోనా వైరస్‌ అతి భయంకరంగా ఉందని అందుకు ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేయించుకుని వ్యాక్సిన్‌ లు వేయించుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు కరోనా టెస్టులు చేయడం జరుగుతుందని ..అందుకు ప్రజలు కూడా తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. నలభై సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని ఆమె కోరారు. వైద్య సిబ్బంది కూడా కరోనా టెస్టులు చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా వైద్య సిబ్బందికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement