Friday, April 26, 2024

టీకా వేయించుకున్న గ్రామ పంచాయితీ సిబ్బంది..

కోయిలకొండ : ప్రజలందరూ కోవిడ్‌ టీకాను వేయించుకోవాలని కోయిలకొండ గ్రామ సర్పంచ్‌ కృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గ్రామపంచాయితీ సిబ్బంది కోవిడ్‌ టీకాను వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉండాలంటే ఈ వ్యాక్సిన్‌ ని తప్పక వాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్‌ కుమార్‌ , ఉప సర్పంచ్‌ ఖాజా నవాజ్‌ , పంచాయితీ సెక్రటరీ రమేష్‌ , శ్రీనివాసులు , రామస్వామి , అంజి , నాగరాజు , రమేష్‌ , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement