Sunday, April 28, 2024

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యనందించాలి..

ప్రభుత్వానికి, ప్రజలకు మ‌ధ్య వారధిగా ఉంటూ స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందించాలని టీయూడబ్ల్యూజే-హెచ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు కోరారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో వున్న జర్నలిస్టుల పిల్లలకు పదవ తరగతి వరకు ఉచిత విద్యనందించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్, ప్రదీప్, సాజిద్, బాలస్వామి, సత్యం, పోలా ప్రసాద్, మలిపెద్ది రమేష్, ప్రదీప్, ఏటిగడ్డ వెంకటేష్, సిక్స్ టీవీ శ్రీనివాస్, రామ్ లక్ష్మణ్, రామకృష్ణ, బాబు సాగర్, విజేందర్ రెడ్డి, ఫోటోగ్రాఫర్స్ శ్రీను, రాము, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement