Thursday, April 18, 2024

అపార్ట్ మెంట్ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

నిజామాబాద్ అర్బన్ : నగరంలోని సుభాష్ నగర్ లో ఓ వివాహిత అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య కు పాల్పడింది. సుభాష్ నగర్ లోని సుధా హైట్స్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న పూర్ణిమ (26) గురువారం ఉదయం అపార్ట్ మెంట్ లోని ఐదవ అంతస్తు పై నుంచి దూకింది. స్థానిక ప్రజలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పూర్ణిమ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. భర్త విశాల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నారు. పూర్ణిమ భర్త విశాల్ కుటుంబం గత కొన్ని సంవత్సరాల నుండి ఈ అపార్ట్ మెంట్ లోనే అద్దెకు ఉంటూ గత మూడు రోజుల క్రితం మూడో ఫ్లోర్ లో ఒక ప్లాటును కొనుగోలు చేశారు. పెళ్లయిన రెండు నెలల లోపే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్ణిమతో పాటు భర్త విశాల్, అత్త, మామ ఒకే దగ్గర కలిసి ఉంటున్నారు. మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement