Friday, May 3, 2024

చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన..

దేవరకద్ర : రైతుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం … చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలో చిన్నచింతకుంట మండల పరిధిలోని ఏదులాపురం గ్రామంలో 8 కోట్ల 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. నీటి నిల్వ కోసమే గ్రామాల్లో చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. చెక్‌ డ్యామ్‌ ద్వార రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. రైతుల అభివృద్ది కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చెక్‌డ్యామ్‌ ద్వార గ్రామాలు కూడా కళకళలాడుతున్నాయని ఆయన అన్నారు. చెక్‌ డ్యామ్‌ పనులు వేగవంతంగా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌ రెడ్డి, ఎంపిపి హర్షవర్దన్‌ రెడ్డి , జడ్పిటిసి రాజేశ్వరి రాము , ప్రభాకర్‌ , ఎంపిటిసి సభ్యులు పార్టీ అధ్యక్షులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement