Friday, April 26, 2024

కార్యాలయంలో కుర్చీలతో ఇక్కట్లు..

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు కోసం వచ్చే వారికి ఇలాంటి కుర్చీలు ఉంటే కూర్చునేది ఎలాగా అని ఫిర్యాదుదారులు అంటున్నారు. వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు కొందరు దాతలు ముందుకొచ్చి కుర్చీలను ఇప్పించడం జరిగింది. అవి కూడా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు ఆ కుర్చీల గురించి పట్టించుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ద తీసుకుని కార్యాలయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement