Thursday, April 25, 2024

నా చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నా – తనికెళ్ళ భరణి

తనికెళ్ళ భరణి గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా రచయితగా ఎంతో ప్రఖ్యాతలు ఉన్న తనికెళ్ళ భరణి ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. శబ్బాష్‌ రా శంకరా అంటూ ఆయన ప్రచురించిన పుస్తకంకు కొనసాగింపుగా ఫేస్‌బుక్‌ ద్వారా కొత్త కవితలను అభిమానులకు పరిచయం చేస్తున్న క్రమంలో తాజాగా పోస్ట్‌ చేసిన ఓ కవిత హేతువాదుల ఆగ్రహానికి గురైంది. దీనితో వెంటనే తనికెళ్ళ భరణి వారికి క్షమాపణలు చెప్పాడు .

ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన శబ్బాష్‌ రా శంకరా కవితలో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొందరి మనసులను నొప్పించాయి. ఆ కవితకు వివరణ ఇస్తే కవరింగ్‌లాగా ఉంటుంది. కాబట్టి అలాంటిదేం చేయకుండా నొప్పించినందుకు నా చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా. ఆ పోస్టు కూడా డిలీట్‌ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషికీ ఇంకొకరిని నొప్పించే అధికారమే లేదు. జరిగిన పొరపాటుకు మన్నించండి అంటూ తనికెళ్ల భరణి చెప్పుకొచ్చాడు.

https://www.facebook.com/watch/?v=448749672854538

Advertisement

తాజా వార్తలు

Advertisement