Friday, April 19, 2024

పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు: ఆదిమూలపు సురేష్

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు విద్యాశాఖ శ్రద్ద తీసుకుంటుందన్నారు. పరీక్షల విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంతకు ముందే షెడ్యూల్ తో ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉన్నామన్నారు..కానీ రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement