Friday, May 17, 2024

బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అవుతున్న దేవాలయం

దేవరకద్ర : మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంకొండ వద్ద అలివేల మంగమ్మ బ్రహ్మోత్సవాలకు దేవాలయం ముస్తాబవుతున్నది. బ్రహ్మోత్సవాల సందర్బంగా దేవాలయాన్ని రంగులతో తీర్చిదిద్దే విద్యుత్‌ దీపాలతో అలంకరణ చేస్తున్నారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారమే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ , ఈఓ శ్రీనివాస రాజు తెలిపారు. ఈ నెల 26 నుండి 29 వరకు అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వారు తెలిపారు. 26న అంకురార్పణ , 27న ధ్వజారోహణ , దేవతామూర్తుల ఆహ్వానం , 28న అమ్మవారి కళ్యాణోత్సవం , గరుడ వాహనసేవ విమాన రథోత్సవం , 29న అశ్వవాహన సేవ , 30 న పూర్ణాహుతి వసంతోత్సవం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు మాస్కు ధరించి బ్రహ్మోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement