Sunday, April 28, 2024

అలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాలు

దేవరకద్ర : రాష్ట్రంలో పేదల తిరుపతి గా పేరుగాంచిన మన్యంకొండ సమీపంలో ఉన్న అలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయాన్ని అన్ని హంగులతో ముస్తాబు చేశామని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ రావు తెలిపారు. బ్రహ్మోత్సవాల ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని ఆయన చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement