Monday, April 29, 2024

మన్యం కొండలో భక్తుల తాకిడి

మహబూబ్‌నగర్ : శ్రీనివాస గోవిందా… శ్రీ వేంకటేశా గోవిందా అంటూ మన్యం కొండలో భక్తుల తాకిడి పెరిగింది. సామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మన్యం కొండకు తరలివచ్చారు. స్వామివారికి అర్చకులు అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలతో పూలతో అలంకరణ చేశారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఎండను కూడా లెక్కచేయకుండగా అలాగే నిలబడ్డారు. మహిళలు దేవాలయ ప్రాంగణంలో దాసంగాలు పెట్టుకుంటున్నారు. ఆపద మొక్కుల వాడా అనాథ రక్షో గోవిందా అంటూ భక్తులు స్వామివారి దర్శనం కోసం పరుగులు పెడుతున్నారు. భక్తుల కోసం దేవాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ , ఈఓ శ్రీనివాస రాజు , నిత్యానంద చారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement