Saturday, May 4, 2024

TS – వేముల‌వాడ ఆల‌యంలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో లింగోద్భవ పూజ

వేములవాడ, – మహా శివరాత్రి సందర్బంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం , అర్దరాత్రి లింగోద్భవ పూజ నిర్వహించగా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,  ప్రభుత్వ విప్ లు, వేములవాడ, ధర్మపురి ఎం ఎల్ ఏ లు
ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు.  అంతకుముందు రాజన్న సన్నిధిలో ఆలయ అర్చకులు, అధికారులు మంత్రి, విప్ కు స్వాగతం పలికారు. అనంతరం వారిద్దరూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 3.30 గంటల వరకు లింగోద్భవ పూజ కొనసాగింది. భక్తుల శివ నామస్మరణ, శివోహం ఆలపనతో ఆలయ ఆవరణ మార్మోగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement