Wednesday, May 1, 2024

Lightning – పిడుగుపాటుకు వృద్ధుడు మృతి..

భీమారం, సెప్టెంబర్ 2(ప్రభన్యూస్ )మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్రంలో శనివారం పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి. బండారి. లింగయ్య (70)తండ్రి రాజయ్య భీమారం గ్రామంలో గత పది సంవత్సరాలనుండి భీమారం గ్రామం తెనుగు వాడలో స్థిర నివాసం ఉంటున్నాడు. మండల కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంక్ కి వెళ్లి వస్తుండగా వర్షం పడుతున్న క్రమంలో మృతుని స్వ గృహం కి పది అడుగుల దూరంలో పిడుగు పాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రంభ, కుమారుడు ఒక కూతురు, కూతురు కి పెళ్లి అయింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement