Monday, April 29, 2024

Leopard: చిరుతపులి సంచారం… వ్యవసాయ తోటలో అడుగులు..

జ‌గిత్యాల జిల్లాలో చిరుత‌పులి సంచారం ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతుంది. ఇబ్రహీంపట్నం మండలంలోని సత్తక్కపల్లి, ఎర్రపూర్, అమ్మక్కపేట గ్రామ శివారులో గ్రామస్థులు చిరుత సంచరిస్తునట్లు చెబుతున్నారు.

వ్యవసాయ తోటలో చిరుత అడుగులను గుర్తించారు. అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు. పాదాల అడుగులను అధికారులు పరిశీలించారు. పూర్తి నిఘాను అధికారులు ఏర్పాటు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లొద్దని రైతులకు సూచించడం జరిగింది. పది రోజుల నుంచి మూడు గ్రామాల్లో చిరుతపులి తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement