Monday, April 29, 2024

TS: సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్‌… ప్రమాద భీమా పెంపు

సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందింది. సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచ‌నున్నారు. సింగ‌రేణి కార్మికుల‌కు కోటిరూపాయాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రించారు.

ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.కోటికి పెరగనుంది. యూబీఐలో అకౌంట్ కలిగిన ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement