Sunday, April 28, 2024

TS: కారు, బైక్ ఢీ…వ్య‌క్తికి తీవ్ర గాయాలు

తిమ్మాపూర్, జనవరి 24 (ప్రభ న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎల్ ఎండి సెంట్ ఆంటోనీ స్కూల్ ఆవరణలో రాజీవ్ రహదారి పై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదాపూర్ మండలం లక్ష్మన్న పల్లి పల్లె గ్రామానికి చెందిన బండి రవి కరీంనగర్ నుంచి ఉదయం తన లేబర్ పని కి ఎల్ ఎం డి కి వస్తున్నాడు. పని కోసం తిమ్మాపూర్ స్టేజి వద్ద కు రావడానికి వస్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న కారు టూవీలర్ ను ఢీ కొట్టింది. దీంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన సమాచారం తెలుసుకున్న ఎల్ ఎం డి ఎస్సై చేరాలు సంఘటన స్థలానికి చేరుకొని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. వివరాలు ప్రకారం ఎల్ ఎండి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement