Thursday, April 25, 2024

వికారాబాద్ లో చిరుత సంచారం.. ఆవుపై దాడి చేసి..

వికారాబాద్‌ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతున్నది. కులకచర్ల మండలం చెర్వుముందలి తండాలో ఓ ఆవుపై చిరుత దాడిచేసి చంపేసింది. గ్రామానికి చెందిన శంకర్ అనే రైతుకు చెందిన పొలం వద్ద సోమవారం రాత్రి పశువులపై చిరుత దాడి చేయడంతో ఓ ఆవు మృతి చెందింది. దీంతో రైతు శంకర్‌ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement