Sunday, May 26, 2024

TS: అర్థరాత్రి సబ్​స్టేషన్​లో అగ్ని ప్రమాదం..

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో అర్థ‌రాత్రి స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఒక్కసారిగా మంటలు పోలీసుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈఘ‌ట‌న భువనగిరి మండలం హనుమాపురం సబ్ స్టేషన్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ఇందుకు భువనగిరి 1, ఆలేరు 1 ఫైర్ ఇంజన్లను ఉపయోగించి దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ తోనే ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement