Sunday, April 28, 2024

IND vs ENG: లంచ్ బ్రేక్.. 440 ప‌రుగుల ఆధిక్యంలో భార‌త్‌

నాలుగో రోజు ఆట‌లో లంచ్ విరామానికి భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 314 ప‌రుగులు చేసింది. ఓవ‌ర్ నైట్ స్కోరు 196/2 తో రెండో ఇన్నింగ్స్‌ను భార‌త్ ప్రారంభించింది. 246 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. సెంచ‌రీకి తొమ్మిది ప‌రుగుల దూరంలో శుభ్‌మ‌న్ గిల్ (91; 151 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స‌ర్లు) ర‌నౌట్ అయ్యాడు

రెహాన్ అహ్మ‌ద్ బౌలింగ్ జో రూట్ క్యాచ్ అందుకోవ‌డంతో కుల్దీప్ యాద‌వ్ (27) ఔట్ అయ్యాడు. దీంతో 71.4వ ఓవ‌ర్‌లో 258 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది. లంచ్ స‌మ‌యానికి య‌శ‌స్వి జైస్వాల్ (149), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (22) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 440 ఆధిక్యంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement