Tuesday, April 30, 2024

కేవీపీ ఇంట్లో చోరీ.. రూ.46 లక్షల విలువైన నెక్లెస్ మాయం

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది. రూ.46 లక్షల ఖరీదైన డైమండ్ నెక్లెస్ దొంగలు ఎత్తుకెళ్లారు. కేవీపీ భార్య సునీత మే 11న ఓ వివాహ వేడుకకు ఈ నెక్లెస్ వేసుకుని వెళ్లొచ్చారు. ఆ తర్వాత నుంచే నెక్లెస్ కనిపించడం లేదంటూ రెండు రోజుల కిందట బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement