Tuesday, April 30, 2024

సోనియాగాంధీపై – కేఏపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు- పార్టీల‌కంటే దేశ‌మే ముఖ్యం

సోనియా గాంధీ తెలంగాణ త‌ల్లి కాదు..దేశ‌దోహ్రి అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు..ప్ర‌ముఖ క్రైస్త‌వ మ‌త ప్ర‌బోధ‌కుడు కేఏపాల్. కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ అని… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని చెప్పారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని పాల్ సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 48 ఎంపీ స్థానాలకు పరిమితమయిందని… రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30 లేదా 20కి చేరుతుందని జోస్యం చెప్పారు. పార్టీల కంటే మనకు దేశమే ముఖ్యమని అన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని విమర్శించారు. జాతీయ రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ పై జరిగిన దాడిని కేఏ పాల్ ఖండించారు. హైదరాబాదులో రెడ్డి గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ… అది రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని… మాటల ద్వారా దాడి చేయడం కూడా తప్పేనని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement