Monday, May 6, 2024

సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని కులాలకు పెద్దపీట…మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

బాలాపూర్ జూలై 25 ప్రభ న్యూస్ – సీఎం కేసీఆర్ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఅర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జల్ పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీరామ కాలనీ వివిధ పార్టీ లకు చెందిన పెద్ద ఎత్తున కురువ సంఘం కుటుంబ సభ్యులు.జల్ పల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, జల్ పల్లి మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్ధన్ ఆధ్వర్యంలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారినీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన కురువ సంఘ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ  మహేశ్వరం అభివృద్ధి మంత్రి సబితా ఇంద్రారెడ్డితోనే సాధ్యమని భావించి పార్టీలో చేరామని వారు తెలిపారు. ముఖ్యంగా  కుల సంఘాలకు భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించినందుకు మంత్రికి హర్షద్వానాల మధ్య  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ కొరకు కష్టపడి పని చేయాలని, పార్టీలో పని చేసే వారికి సముచిత స్థానం  కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మంత్రి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపల్ సీనియర్ నాయకులు సూరెడ్డి సత్తిరెడ్డి, దూడల శ్రీధర్ గౌడ్ వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement