Tuesday, May 7, 2024

కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి సన్నిధిలో.. ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు

కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారిని సకుటుంబ సమేతంగా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ .. IVF జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ.. ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ.. సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని, బీ.ఆర్.ఎస్ పార్టీకి అంతా మంచి జరగాలి అని.. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో BRS ఘన విజయం సాధించి తెలంగాణ మోడల్ చేయాలని.. దేశంలో మన ప్రభుత్వం రావాలని కోరుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ , సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు బాగుండాలని, దేశ, రాష్ట్ర ప్రజలు, సుభిక్షంగా ఉండాలని, ఈ కొత్త సంవత్సరం 2023 లో రైతులు అంతా పాడి పంటలతో విలసిల్లాలని ప్రజలు అందరూ ఆనందంగా వుండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని మనసారా కోరుకున్నానని తెలిపారు. కాగా ఆయన వెంట.. కుమారులు ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయితేజ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement