Sunday, May 5, 2024

ఇవ్వాల ఖ‌మ్మంలో ప‌ర్య‌టించ‌నున్న కేటీఆర్‌.. కార్య‌క్ర‌మాలు ఏంటంటే..

టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ ఇవ్వాల‌ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఖమ్మం పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొనేందుకు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ ద్వారా ఖ‌మ్మం బ‌య‌లుదేరి వెళ్లారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతోనూ ఈ సంద‌ర్భంగా భేటీ కానున్న‌ట్టు తెలుస్తోంది.

ఇవీ కార్య‌క్ర‌మాలు..

కాగా, ఇప్పికే మంత్రి కేటీఆర్‌ హెలికాప్టర్‌లో ఖమ్మం పట్టణానికి బ‌య‌లుదేరారు. లకారం చెరువుపై రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌, మ్యూజికల్‌ ఫౌంటేన్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ను జాతికి అంకితం చేస్తారు.

రఘునాథపాలెంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సుడా పార్క్‌, బృహత్‌ పల్లెప్రకృతివనం ప్రారంభిస్తారు.

టేకులపల్లిలో 240 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభిస్తారు.

- Advertisement -

సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పాత మున్సిపల్‌ కార్యాలయంలో సిటి లైబ్రరీ, ఐటీ హబ్‌ సర్కిల్‌ నుంచి జడ్పీ సెంటర్‌ వరకు నిర్మించిన ఫుట్‌పాత్‌, దానవాయిగూడెంలో ఎఫ్‌ఎస్టీపీ, ప్రకాశ్‌నగర్‌లోని వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు.

శ్రీనివాస్‌నగర్‌లో మానవ వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ధంసలాపురం వద్ద ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన నర్సరీని ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement