Friday, May 10, 2024

అమెరికాలో శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం.. యూకే, దుబాయ్‌లోనూ నిర్వ‌హిస్తాం: వైవీ

తిరుమల: అమెరికాలో ఉన్న తెలుగువారి కోసం ఈ నెల 18వ తేది నుంచి జులై 9తేదీ దాకా కల్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహించ‌నున్న‌ట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏడు నగరాల్లో కల్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామ‌న్నారు. నాటా ఆధ్వర్యంలో కల్యాణోత్సలుంటాయ‌ని, భక్తులుకు ఉచితంగానే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. కల్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహలను తిరుమల నుంచి తీసుకువెళ్లి…. తిరుమల తరహలోనే కార్యక్రమాని నిర్వహిస్తామ‌న్నారు సుబ్బారెడ్డి. త్వరలోనే యూకే, దుబాయ్ వంటి దేశాల్లో కూడా శ్రీ‌వారి కల్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించ‌నున్న‌ట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement